ముంబై ,జూలై : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్డబ్ల్యూ, భారత మార్కెట్లో సరికొత్త ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్ను విడుదల చేసింది. కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్ మోడల్ ఇప్పుడు ఆల్పైన్ వైట్ ,ఫైటోనిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తున్నది. 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 192 బిహెచ్పి పవర్ 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇంజిన్ 7-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేసి ఉంటుంది.ఈ కొత్త బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్లో స్టీరింగ్ వీల్తో పెడల్ షిఫ్టర్,క్రూయిజ్ కంట్రోల్తో బ్రేకింగ్ ఫంక్షన్ స్టాండర్డ్ గా అందించనున్నారు. ఈ ఎస్యూవీలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ స్విచ్ ఉపయోగించి, వేర్వేరు డ్రైవింగ్ మోడ్లను ఎంచుకోవచ్చు. ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్ ,స్పోర్ట్.మోడ్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్లో ఆరు ఎయిర్బ్యాగులు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి), కార్నింగ్ బ్రేకింగ్ కంట్రోల్ (సిబిసి), ఆటో హోల్డ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ సెన్సార్ వంటివి ఉన్నాయి. మార్కెట్లో బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 20ఐ టెక్ ఎడిషన్ ధర రూ. 43 లక్షలుగా ఉన్నది.