పట్నా: బీహార్లో జేడీయూ, బీజేపీ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. సీఎం నితీశ్కుమార్ పార్టీ అదుపులో ఉండాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సన్యాల్ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే 76 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు సమాధానం చెప్తారని హెచ్చరించారు. అశోకుడిపై ప్రముఖ రచయిత దయా ప్రకాశ్ సిన్హా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు అందజేసిన పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ సింగ్ ప్రధానికి లేఖ రాశారు. అయితే ఆయనను అరెస్టు చేయకుండా పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలంటూ ప్రధానికి లేఖ రాయడమేంటని బీహార్ బీజేపీ చీఫ్ మండిపడ్డారు.