న్యూఢిల్లీ : అండమాన్ ఎయిర్పోర్ట్లో (Andaman Airport) నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఫాల్స్ సీలింగ్లో ఓ భాగం కూలిన ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ హీటెక్కింది. ఎయిర్పోర్ట్లోని సీలింగ్లో కొంత భాగం ఊడిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తోసిపుచ్చారు.
సీసీటీవీ పనుల కోసం సీలింగ్ను ఉద్దేశపూర్వకంగానే వదులు చేశారని మంత్రి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న లేదా నాణ్యత కొరవడిన మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభిస్తున్నారని గాలిలో వేలాడుతున్న ఫాల్స్ సీలింగ్ ప్యానెల్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
జైరాం ట్వీట్పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. ఈసారి గన్ తీసుకుని ఏమీ లేని విషయం నుంచి సంచలనాల కోసం పాకులాడే ముందు వివరణ కోరండని జైరాం రమేష్పై మంత్రి చురకలు వేశారు. ఇక అండమాన్ ఎయిర్పోర్ట్లో ఫాల్స్ సీలింగ్ ఊడిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Read More :