హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై సోషల్మీడియాలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీసీఎస్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న సోషల్మీడియా వేదికగా సీఎం కేసీఆర్పై పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ అరవింద్ మాట్లాడారని తెలిపారు. ఆ వ్యాఖ్యలు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలలా ఉన్నాయని పేర్కొన్నారు. అరవింద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్క్రైమ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావును కోరారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో టీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు అనిల్గౌడ్, ఏ శ్రీకాంత్, సైదులు, రాజు, ఆచారి, అవినాష్, మిథున్ప్రసాద్, టీఆర్ఎస్వీ నిజాం కాలేజీ విద్యార్థి సంఘం సభ్యులు ఉన్నారు.