Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు.. రోహిణి కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. సోమవారం సింగపూర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతమైంది. సింగపూర్ వైద్యులు రోహిణి కిడ్నీని లాలూకు విజయవంతంగా అమర్చారు. ఈ విషయాన్ని లాలూ కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా, 40ఏళ్ల రోహిణి.. 74 ఏళ్ల తన తండ్రికి కిడ్నీ దానం చేయడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది చాలా కఠినమైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సైతం రోహిణిని ప్రశంసించారు. ‘రోహిణి ఆచార్య ఒక ఐడియల్ డాటర్. నిన్ను చూసి గర్వపడుతున్నా. నువ్వు భవిష్యత్తు తరాలకు ఆదర్శం’ అంటూ ట్వీట్ చేశారు.
“बेटी हो तो रोहणी आचार्य जैसी” गर्व है आप पर… आप उदाहरण होंगी आने वाले पीढ़ियों के लिए । pic.twitter.com/jzg3CTSmht
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) December 5, 2022