జయశంకర్ భూపాలపల్లి : బీజేపీ అధికారం కోసం ఎంతకైనా దిగజారి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశంలో
మంత్రి మాట్లాడారు. నిరుద్యోగులకు, పట్టభద్రులకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. బీజేపీ నేతలు చేతకాని చవటలు, దద్దమ్మలు కాబట్టే సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారు.
పిచ్చి కూతలు మానుకోకపోతే ప్రజల చేతిలో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి బ్లాక్ మెయిలర్లను పట్టభద్రులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ఓట్ల కోసం మభ్య పెడుతుంది అనే విషయం పట్టభద్రులు గమనించాలన్నారు. నిరుద్యోగులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు మంజూరు చేస్తామన్నారు. అవాస్తవాలు మాట్లాడటం బీజేపీ పని అయిపోయింది. అంతే తప్ప వాళ్ళతో ఒరిగేదేమీ లేదన్నారు.
కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం
. నేను, ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
బీజేపీ వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.