హైదరాబాద్: నగరానికి చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా కోవిడ్ టీకాలను తయారు చేయనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని బీఈ సంస్థకు బదిలీ చేయనున్నది. ఈ విషయాన్ని బీఈ సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇండియా నుంచి అనేక ప్రతిపాదనలను డబ్ల్యూహెచ్వో అడ్వైజరీ కమిటీ పరిశీలించిందని, ఆ ఆధారంగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా కోవిడ్ టీకాను అభివృద్ధి చేసే అవకాశాన్ని బీఈ కంపెనీకి ఇచ్చినట్లు ఆ ప్రకటనలో చెప్పింది. డబ్ల్యూహెచ్వోతో పాటు ఇతర భాగస్వామలు ఎంఆర్ఎన్ఏ టీకా తయారీ కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నారు. దీని కోసం కావాల్సిన కార్యాచరణను బీఈ డెవలప్ చయనున్నది. వీలైనంత త్వరలో ఎంఆర్ఎన్ఏ టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు బీఈ కంపెనీ తన ప్రకటనలో చెప్పింది.
పరిశోధనశాల్లో తయారైన మెసెంజర్ ఆర్ఎన్ఏతో ఆ వ్యాక్సిన్లను తయారు చేస్తారు. ఈ వ్యాక్సిన్లు మానవ కణాల్లో వ్యాధి నిరోధక ప్రోటీన్లను రూపొందిస్తాయి. ఆ ఇమ్యూన్ వ్యవస్థ నిజమైన వైరస్తో పోరాడుతుంది. అయితే ఇండియాలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో తయారయ్యే టీకాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. చౌకైన టీకాలను ఉత్పత్తి చేసే క్రమంలో అసాధారణ మైలురాయిని చేరుకున్నట్లు బీఈ సంస్థ ఎండీ మహిళ ధాట్ల తెలిపారు. డబ్ల్యూహెచ్వో తమపై ఉంచిన నమ్మకాన్ని కట్టుబడి టీకాలను ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రపంచ స్థాయిలో తమ కంపెనీ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గత ఏడాది నుంచి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై బీఈ ఇన్వెస్ట్ చేస్తోందని, ఈ కొత్త టెక్నాలతో భవిష్యత్తులో అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్లను తయారు చేస్తామని మహిమ తెలిపారు.