హైదరాబాద్, జనవరి 10: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల చార్జింగ్ సదుపాయాల సంస్థ బైక్వో..ప్రచారకర్తగా ప్రముఖ నటుడు వెంకటేశ్ను నియమించుకున్నది. దీంతోపాటు ఆయన వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా వ్యవహరించనున్నారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 20 వేల ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..అందుకుతగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నది. దీంట్లోభాగంగా బ్రాండ్ను మరింత ప్రమోటింగ్ చేయాలనే ఉద్దేశంతో వెంకటేశ్ను ప్రచారకర్తగా నియమించుకున్నట్టు కంపెనీ కో-ఫౌండర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.