న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా పేదరికం ఉన్న రాష్ర్టాల జాబితాలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ) వివరాలను తాజాగా విడుదల చేసింది. ఈ సూచీ ప్రకారం బీహార్ జనాభాలో 51.91 శాతం మంది పేదలు ఉన్నారు. జార్ఖండ్, యూపీల్లో ఇది వరుసగా 42.16, 37.79 శాతంగా ఉంది. ఇక 36.65 శాతం మంది పేదలతో మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో, మేఘాలయ(32.67) ఐదో స్థానంలో ఉంది. కేరళ(0.71%), గోవా(3.76%), సిక్కిం (3.82%), తమిళనాడు(4.89%), ఢిల్లీ(4.79%), పంజాబ్ (5.59%)ల్లో పేదల సంఖ్య తక్కువగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొన్నది. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణలో 13.74%, ఆంధ్రపదేశ్లో 12.31% మంది పేదలు ఉన్నారని వెల్లడించింది.