పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న జూలో ఓ పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం ఆ పిల్లలకు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ పేర్లు పెట్టారు. ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా ఆ పసి కూనలకు నామకరణం చేశారు. మూడు మగ పిల్లలకు కేసరి, విక్రమ్, మగధ అని పేరు పెట్టగా, ఇక ఆడ పులి పిల్లకు రాణి అని పేరు పెట్టినట్లు అటవీశాఖ, పర్యావరణశాఖ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ తెలిపారు. పులల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 2018 సెన్సెస్ ప్రకారం 31 పులులు ఉన్నాయి. 2022 రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ సంఖ్య 45కు చేరి ఉంటుందని మంత్రి అన్నారు.