నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ గురువారం సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారా ైగ్లెడింగ్ ద్వారా కవిత భారీ ఫ్లెక్సీతో ఆకాశంలో విహరించి అభినందనలు తెలిపారు. 40 ఫీట్ల పొడవున్న ఈ భారీ శుభాకాంక్షల ఫ్ల్లెక్సీ ఆకాశంలో ఎగురగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.