పాట్నా : బిహార్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. మోతిహరి జిల్లాలోని ఓ నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. షికార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సికార్హానా నదిలో చోటు చేసుకున్నది. పశువుల మోత కోసం పడవలో వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం చేరుకొని పలువురిని రక్షించారు. నీటిలో గల్లంతైన వారి కోసం పోలీసులు, రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో 22 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. స్థానికులు నలుగురిని రక్షించగా.. వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు ఏడీఎం అనిల్కుమార్ తెలిపారు.