బీబీనగర్: హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్తో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ డీఎన్ఎ ఆధారిత విశ్లేషణలు చేయడానికి రెండు సంస్థలకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. భవిష్యత్తులో ఎయిమ్స్ బీబీనగర్లో 42 రకాల వైద్య విభాగాలకు విస్తరించనున్నట్టు తెలిపారు.
సీడీఎఫ్డీ డైరెక్టర్ తంగరాజ్ మాట్లాడుతూ ఒక నిర్ధిష్ట రంగంలో నైపుణ్యం కలిగిన అనేక మంది అధ్యాపకులు మా వద్ద ఉన్నారని, లైఫ్ సైన్సెస్, క్లీనికల్ పరిశోధనలలో రెండు సంస్థల మధ్య సహకారం ఉంటుందని, మెడికల్ జెనెటిక్స్ పరి శోధనను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్ నరాంగ్, డాక్టర్ అశ్విన్, డాక్టర్ దలాల్, డాక్టర్ సంగీత, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ మృదుల, డాక్టర్ శైలు, పీఆర్వో శ్యామల తదితరులు పాల్గొన్నారు.