ప్రజలకు ప్రయోజనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా దవాఖానకు మహర్దశ పట్టనున్నది. వంద పడకల వైద్యశాల నిర్మించగా దానిని 300 పడకలకు మార్చనున్నారు. అందుకు అనుగుణంగానే తగు సామర్థ్యంతో భవనాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులతో పూర్తయిన భవనంలో అనధికారికంగా ప్రజలకు వైద్య సేవలందుతున్నాయి. కొంత మేరకు పరికరాలు, సామగ్రి ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందిని నియమించారు. కాగా అదనపు పనులు, సామగ్రికి ప్రభుత్వం ప్రస్తుతం రూ.52.55 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల మంజూరు, వైద్య పరికరాలు, సిబ్బంది కోసం పలుమార్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఎమ్మెల్యే ప్రయత్నాలు ఫలించాయి. వైద్యశాల పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజలకు సైతం వైద్య సేవలు అందనున్నాయి.
భూపాలపల్లి టౌన్, నవంబర్ 3 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా దవాఖాన మహర్దశ పట్టనుంది. ఇప్పటికే అన్ని హంగులతో నిర్మాణం పూర్తయిన భవనంలో అనధికారికంగా ప్రజలకు వైద్య సేవలందుతున్నాయి. కొంత మేరకు పరికరాలు, సామగ్రి, వైద్యులు, సిబ్బందిని నియమించారు. 100 పడకల భవనం నిర్మించగా దానిని 300 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. అందుకు అనుగుణంగానే ముందుగానే తగు సామర్థ్యంతో నిర్మించారు. కాగా అదనపు పనులు, సామగ్రికి ప్రభుత్వం ప్రస్తుతం రూ.52.55 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వైద్యశాలలో వైద్య పరికరాలు, వైద్యులు, సిబ్బంది, ఇతర పనులకు నిధుల మంజూరుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పలు మార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు భూపాలపల్లి జిల్లా దవాఖానతో పాటు మరి కొన్ని వైద్యశాలలకు సైతం నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పలుమార్లు విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఎట్టకేలకు జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఆసుపత్రిలో పరికరాలు, సామగ్రి కొనుగోలుకు రూ.10.75 కోట్లు, సివిల్ పనులకు రూ. 41.80 కోట్లు మొత్తం రూ. 52.55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆసుపత్రి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే జయశంకర్ భూపాలపలల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజలకు సైతం వైద్య సేవలు అందనున్నాయి.
గతంలోనే ప్రతిపాదనలు
జిల్లా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల కోసం గతంలోనే వైద్యశాఖ అధికారులు వైద్యవిధాన పరిషత్కు ప్రతిపాదనలు పంపారు. కరోనా పరిస్థితులతో నిధుల మంజూరులో జాప్యం జరిగింది. సివిల్ సర్జన్ పోస్టులు 10 ఉండగా ఇందులో గైనకాలజిస్టు 2, పిల్లల వైద్యనిపుణులు 2, మత్తు వైద్యనిపుణులు 2, జనరల్ మెడిసిన్ 1, జనరల్ సర్జన్ 1, ఆర్థో 1, చెవి ముక్కు వైద్యనిపుణులు అవసరం కానున్నారు. డిప్యూటీ సివిల్ సర్జన్లు 7 అవసరముండగా ఇందులో గైనకాలజిస్టు 1, పిల్లల వైద్యనిపుణులు 1, మత్తు వైద్యనిపుణులు1, జనరల్ మెడిసన్ 1, జనరల్ సర్జన్ 1, రేడియోలజీ 1, చెస్ట్ వైద్యనిపుణులు 1 అవసరం కానున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 20 మందికి గాను ఇందులో గైనకాలజిస్టు 2, పిల్లల వైద్యనిపుణులు 2, మత్తు వైద్యనిపుణులు 2, జనరల్ మెడిసన్ 2, జనరల్ సర్జన్ 2, రేడియోలజీ 1, చెస్ట్ వైద్యనిపుణులు 2, ఫోరెన్సిక్ మెడిసిన్ 1, ఈఎన్టీ 1, ఆర్థో 2, పుల్మనరీ మెడిసిన్ 1, పాథాలోజి 1 అవసరం అవుతారని ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎంబీబీఎస్ లో 5 పోస్టులు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ లో 1 ఖాళీలు ఉన్నాయి.
54 మంది వైద్య సిబ్బంది
నర్సింగ్ సూపరిండెంట్ గ్రేడ్ 2 – రెండు, హెడ్ నర్సు 4, స్టాఫ్ నర్సు 18, మిడ్ బాయ్స్ 1, రేడియోగ్రాఫర్ 1, ఫార్మాసిస్టు గ్రేడ్ 2 మూడు, ఫార్మాసిస్టు గ్రేడ్ 1 ఒకటి, ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ (ఫిమేల్) 4, ఫిజియోథెరపిస్టు 1, జూనియర్ అనాలైసిస్టు 0, ల్యాబ్టెక్నీషియన్ 3, జూనియర్ అసిస్టెంట్ 0, హెల్త్ ఇన్స్పెక్టర్స్ 1, డార్క్ రూం అసిస్టెంట్ 2, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ 1, రీప్రాక్షనిస్టు 1, థియేటర్ అసిస్టెంట్ 2, ల్యాబ్ అటెండెంట్ 2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఎల్ఎస్జీఆర్ 2) 1, సీనియర్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 3, జూనియర్ అనైలజిస్టు 1 పోస్టులకు ప్రతిపాదనలు పంపారు.
వైద్య పరికరాల కోసం
100 పడకల దవాఖాన కోసం అవసరమయ్యే వైద్య పరికరాల కోసం వైద్య విధాన పరిషత్కు ప్రతిపాదనలు పంపారు. ఎక్స్రే మిషన్(300 ఎంఏ) 1, ఈసీజీ మిషన్ 12 చానల్స్ 2, కార్డియాక్ మానిటర్ (బెడ్సైడ్) మల్టీపారా 3 పార్ట్ 1, డెఫిబ్రిలేటర్ 1, సార్ట్ వేవ్ డయాథెర్మి మిషన్ 1, ఆపరేషన్ థియేటర్ సీలింగ్ లైట్ లెడ్ సింగిల్ డూం విత్ ఫోర్ రిప్లెక్టర్స్ 4, ఆపరేషన్ థియేటర్ సీలింగ్ లైట్ లెడ్ సింగిల్ డూం విత్ త్రీ రిప్లెక్టర్స్ 1, అనస్థీసియా మిషన్ 3, పల్స్ ఆక్టీ మీటర్స్ 6, డెంటల్ యూనిట్ 1, ఆపరేషన్ టేబుల్ హైడ్రాలిక్ 4, ఆటోక్లేవ్ సింగిల్ బిన్ 6, ఫోకసింగ్ లైట్ మొబైల్ 4, సెక్షన్ ఆపరేటర్స్ (ఎలక్ట్రికల్ ) 6, ఇన్స్ట్రూమెంట్ ట్రోలీ 8, కాచెరీసెట్ గైనక్ 2, ఆటోమిస్టు 2, మైక్రోస్కోఫీ బైనోక్లియర్ 3, కెమికల్ బ్యాలెన్స్1, సింపుల్ బ్యాలెన్స్ 1, ఫొటో ఎలక్ట్రిక్ పొలరీ మీటర్ 1, ఫ్లేం ఫొటో మీటర్ 0, మైక్రోఫిక్ఫెట్ 3, వాటర్ బాత్ 1, సెంట్రీఫ్యూజ్ 1, ల్యాబ్ ఇంక్యూబెటర్ 1, వాటర్ స్టిల్ 1, హాట్ప్లేట్ 1, రోటర్ కం సాకేర్ 1, ఫీహెచ్ మీటర్ 1, వీల్ చైర్ 10, ట్రోటీ స్ట్రెచర్ 10, ల్యాప్టాప్ విత్ ఫ్రింటర్ 3, సెల్ కౌంటర్ 1, లేబర్ టేబుల్ 3, రిఫ్రిజిరేటర్స్ (300 లీటర్లు) 3, బీపీ ఆపరేటర్స్ విత్ స్టాండ్ 4, నెబులైజర్స్ 6, బెడ్ సైడ్ లాకర్స్ 100, ఐరన్ కార్డ్స్ 100, పరుపులు, దిండులు 100, సెమీ ఆటో అనలైజర్ 1, ఆఫీస్ టేబుల్స్ 20, పరీక్షా టేబుల్స్ 20, ఆఫీస్ చైర్స్ 20, రాక్స్ 20, ఫైబర్ బెంచీలు 20, మెడిసిన్ క్యాబినెట్ 10, స్టూల్స్ 100, బెడ్ సైడ్ స్క్రీన్స్ 15, టీవీ స్టాండ్స్ 100, రిలోవింగ్ స్టూల్స్ 20, ఫుడ్ స్టెప్స్ 10, ఎస్ టైపు చైర్స్ 20, రిలోవింగ్ చైర్స్ 20 కోసం వైద్య విధాన పరిషత్కు ప్రతిపాదనలు పంపారు. కాగా క్రమక్రమంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం రూ.52.55 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు పూర్తయితే త్వరలోనే సీఎం కేసీఆర్ జిల్లా ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయనున్నారు.