బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థానం దక్కించుకునేందుకు తెగ కృషి చేస్తుంది. భూమి పడ్నేకర్. అందంతో పాటు హాట్ అప్పీల్తో వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మడు బాలీవుడ్లో ప్రముఖ నటులలో టాప్ 10లో ఒకరిగాఉంది. సోషల్ మీడియాలోను భూమికి ఫాలోయింగ్ ఎక్కువే. నిత్యం సోషల్ మీడియాలో టచ్లో ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో సౌత్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
తాజాగా భూమి పడ్నేకర్ వెకేషన్లో ఉండగా, అక్కడ బీచ్లో బికినీ వేసుకొని దిగిన ఫొటో సోషల్ మీడియాలో మంటలు రేపుతుంది. గోధుమ రంగు బికినీ ధరించి బీచ్ లో సెల్ఫీ దిగిన ముద్దుగుమ్మ గులాబీ రంగు పెదవులతో పాటు మృదువైన టోన్డ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఎన్ రూట్ ప్యారడైజ్.. అంటూ ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం భాగమతి రీమేక్లో నటిస్తుంది. హిందీలో ఈ చిత్రం దుర్గామతి పేరుతో రీమేక్ అవుతుండగా, అనుష్క నటించిన పాత్రలో భూమి పెడ్నేకర్ నటించారు. అక్షయ్ కుమార్ కథానాయకుడు. ఈ చిత్రం 2020 డిసెంబర్ 11 న స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. భూమి పెడ్నేకర్ బధాయ్ హో సీక్వెల్ బధాయ్ దోలో కూడా నటిస్తున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావు ఇందులో కథానాయకుడిగా నటించారు.