న్యూఢిల్లీ: రెండేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు కోవాగ్జిన్ టీకా ఇచ్చే అంశంలో.. ఆ టీకాకు సంబంధించిన మరింత డేటా కావాలని భారత్ బయోటెక్ సంస్థను డీసీజీఐ నిపుణుల కమిటీ కోరినట్లు తెలుస్తోంది. 2 నుంచి 12 ఏళ్ల పిల్లలకు నియంత్రిత పద్ధితిలో వ్యాక్సిన్ ఇవ్వాలని నిపుణుల కమిటీ ప్రతిపాదనలు చేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ విషయం తెలిసింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై బయోలాజికల్ ఈ సంస్థకు చెందిన కోర్బీవ్యాక్స్ టీకా అత్యవసర వినియోగంపై గురువారం ఆంక్షలు విధించారు.అయితే ఇప్పుడు డీసీజీఐ ఆ టీకాకు అత్యవసర వినియోగం కింద అనుమతి దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లలకు కోర్బీవ్యాక్స్ టీకాను ఇస్తున్న సంగతి తెలిసిందే. 12 ఏళ్ల లోపు పిల్లలకు ఇండియాలో రెండు కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి.