హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో దొంతు భాగ్యలక్ష్మి రెండో స్వర్ణం కొల్లగొట్టింది. శనివారం జరిగిన 800 మీటర్ల రేసులో పసిడి పట్టిన భాగ్యలక్ష్మి ఆదివారం 1,500 మీటర్ల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న టోర్నీలో ఆదివారం రెండో రోజు సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు 8 పతకాలు (4 స్వర్ణాలు, 4 రజతాలు) చేజిక్కించుకున్నారు.