జూబ్లీహిల్స్,నవంబర్25: సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో విద్యార్థులు వాటిని ఎదుర్కొనేందుకు సరైన అవగాహన అవసరమని శ్రీరాంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, డిప్యూటీ ఐవోఎస్ రామలింగయ్య తెలిపారు. గురువారం పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇంటివద్ద ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఆన్లైన్ గేమ్లు ఆడుతూ సైబర్ నేరాగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఏర్పాటుచేస్తున్న సైబర్ కాంగ్రెస్తో ఈ తరహ మోసాలపై అవగాహన కలిగి వాటిని సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. పాఠశాల అంబాసిడర్లుగా పీఈటీ నాగేందర్తో పాటు ఇద్దరు విద్యార్థులను నియమించినట్లు తెలిపారు.