సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో సీసీటీవీ నెట్వర్క్ను అనుసంధానం చేస్తూ మరింత మెరుగైన పోలీసింగ్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఉపయోగపడే విధంగా కొత్త అవిష్కరణలు చేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. హైదరాబాద్ ఐఐఐటీలోని ఏఐ పరిశోధన కేంద్రం, స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్లలో శుక్రవారం సీపీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో ఐఐటీలోని పరిశోధకులతో పాటు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఈబీటీసీ, ఆమ్స్టర్డామ్ ఇన్నొవేషన్, పీడబ్ల్యూసీ, క్వాంటెల, ఎల్టీఐ, ఎయిర్టెల్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సురక్షితమైన కమ్యూనిటీలను నిర్మంచాలని చర్చించారు. ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్ మాట్లాడుతూ, తమ పరిశోధనలు సమాజానికి సహాయం చేసే విధంగా ఉండాలన్న ఆసక్తితో ఉన్నామన్నారు. టెక్నాలజీతో కూడిన పోలీసింగ్లో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల జట్టు ఈ రౌంట్టేబుల్తో మాతో చేరారన్నారు. ఈ సమావేశంలో డీసీపీ విజయ్కుమార్, ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.