సాధారణంగా మనం ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. లేదా పాలసీ తీసుకుంటే లభిస్తుంది. కానీ ఇవేవీ లేకుండానే పెన్షనర్లు ప్రమాద బీమాను పొందవచ్చు. ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నదే మోటర్ వెహికిల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 166. అయితే మూడేండ్లపాటు ఐటీ రిటర్న్స్ను దాఖలు చేసిన పెన్షనర్లే ఇందుకు అర్హులు. ఇక ఈ సెక్షన్ ప్రకారం రోడ్డుప్రమాదంలో పెన్షనర్ చనిపోతే వారి కుటుంబానికి సదరు వ్యక్తి వార్షిక ఆదాయం ఎంతైతే ఉంటుందో.. అంతకు పదింతల బీమాను అందజేస్తారు. పెన్షనర్ సంవత్సర ఆదాయం రూ.5 లక్షలు అనుకుంటే.. రూ.50 లక్షలు ప్రమాద బీమాగా అందుతుంది. ప్రమాదానికి కారణమైన వాహనానికి ఇన్సూరెన్స్ను అమ్మిన సంస్థే ఈ మొత్తాన్ని బాధితులకు అందజేయాలి. ఒకవేళ బీమా క్లెయిమ్ అవ్వకపోతే బాధితులు ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు.
అవగాహన లేక..
ఐటీ రిటర్న్స్ను దాఖలు చేస్తే ఉచితంగానే ప్రమాద బీమాను పొందవచ్చు అన్నదానిపై పెన్షనర్లకు అవగాహన అంతంతమాత్రమే. నిజా నికి సెక్షన్ 166 నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని 2013 అక్టోబర్ 31న సుప్రీం కోర్టు సైతం తీర్పునిచ్చింది.