లండన్: ఉక్రెయిన్, రష్యా మధ్య మళ్లీ యుద్ధం భీకర స్థాయికి చేరింది. క్రిమియా బ్రిడ్జ్ పేల్చివేత నేపథ్యంలో ఇవాళ రష్యా తన మిస్సైళ్లతో ఉక్రెయిన్పై దాడికి దిగింది. ఈ సందర్భంగా మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మాట్లాడుతూ.. పశ్చిమ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉన్న కారణంగా.. రష్యాతో కలిపి జాయింట్ మిలిటరీ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెండు దేశాలు కలిపి ప్రాంతీయ సైనిక గ్రూపును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితమే దళాలను సరిహద్దుల్లోకి రప్పించడం ప్రారంభమైందన్నారు.