హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫలితాల్లో కే శ్రీనివాస్ 97.51, ఈ వైష్ణవి 96.78 పర్సంటైల్ సాధించారు. మొత్తంమీద 44 మంది అబ్బాయిలు, 28 మంది అమ్మాయిలు అర్హత సాధించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విద్యార్థులను అభినందించారు.