కంపాలా : ఉగాండా రాజధాని కంపాలాలో ‘తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ ఉగాండా’ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళలు ఉయ్యాల పాటలు పడుతూ.. పడుతూ.. ఆటలాడారు. సుమారు రెండు గంటల పాటు మహిళలు.. చిన్నా పెద్ద అంతా కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కవిత, వాణి, విద్య, హిరణ్మయి, సబితా, దివ్య, అశ్విని, గాయత్రీ, సుష్మ, పూజిత, స్వాతి, లలిత, ఉమా, రమా, విజయ, చందన, హరిశ తదితరులు పాల్గొన్నారు. పూలపండుగ, తెలంగాణ సంస్కృతిని స్థానికులు చూసి ముచ్చటపడ్డారు. మున్ముందు జరిగే వేడుకల్లో తాము భాగస్వాములవుతామని తెలిపారు.