Bank of Baroda | ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా కీలక వడ్డీరేట్లు పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) చేరింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్) 20 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని టెన్యూర్ రుణాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. శుక్రవారం (2022, ఆగస్టు 12) నుంచి అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.
ఏడాది గడువు గల వ్యక్తిగత, కన్జూమర్ రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.65 నుంచి 7.70 శాతానికి పెరుగుతుంది. నెల రోజుల గడువు గల రుణాలపై 7.40 శాతం, మూడు నెలల టెన్యూర్ రుణంపై 7.45, ఆరు నెలల గడువు గల రుణంపై 7.55 శాతానికి ఎంసీఎల్ఆర్ చేరుకుంటుంది. ఇంతకుముందు రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (బీఆర్ఎల్ఎల్ఆర్) ఆగస్టు 6 నుంచి పెంచినట్లు తెలిపింది.
రిటైల్ రుణాలపై బీఆర్ఎల్ఎల్ఆర్ 7.95 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్బీఐ రెపోరేట్ 5.40 శాతం.. మార్క్-అప్/బేస్ 2.55 శాతం అదనంగా కలిస్తే బీఆర్ఎల్ఎల్ఆర్ అవుతుందని బీవోబీ వెబ్సైట్ వివరించింది. ఇప్పటికే ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా పలు బ్యాంకులు వివిధ రుణాలపై 50 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచేశాయి.