శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని బ్యాంక్ మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చివేశారు. కుల్గామ్లో ఈ ఘటన జరిగింది. ఇలాఖాహి దెహతి బ్యాంక్లో విజయ్ కుమార్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాడి తర్వాత హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనలో విజయ్కు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయన స్వస్థలం రాజస్థాన్లోని హనుమాన్ఘర్. కాల్పుల ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు.