చటోగ్రామ్: ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న బంగ్లాదేశ్-పాకిస్థాన్ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ స్వల్ప ఆధిక్యం(44)తో రెండోసారి బ్యాటింగ్కు దిగిన బంగ్లా ఆదివారం ఆట ముగిసే సరికి 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అఫ్రిది(3/6) సూపర్ స్పెల్తో షాద్మన్ (1), హుస్సేన్(0), కెప్టెన్ మోమినుల్ (0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆరు వికెట్లు చేతిలో ఉన్న బంగ్లా ప్రస్తుతం 83 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు (145/0)తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్కు దిగిన పాకిస్థాన్ 286 పరుగులకు ఆలౌటైంది. తైజుల్ ఇస్లామ్(7/116) వీరవిహారంతో పాక్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.