అగ్ర హీరో బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తాను హోం ఐసోలేషన్కు వెళ్లానని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, కొద్ది రోజుల క్రితం తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది.