హైదరాబాద్: తాజాగా సైదాబాద్ పరిధి సింగరేణి కాలనీ ఘటన నేపథ్యంలో భరోసా కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగర సీపీ అంజనీకుమార్ వారితో మాట్లాడారు. యువతులు ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని సూచించారు. యువతకు, చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలనీ పరిసర ప్రాంతాల అమ్మాయిలు పాల్గొన్నారు. పోలీసు ఉన్నతాధికారులు శిఖా గోయల్ (అడిషనల్ సీపీ, హైదరాబాద్) ఆడ పిల్లలకు ఆపద వచ్చినపుడు ఎలా స్పందించాలో వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. సింగరేణి కాలనీ తరహా ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.