‘సమ్మోహనం’, ‘వీ’ తర్వాత హీరో సుధీర్బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో మూడో చిత్రం రూపొందుతున్న సంగత తెలిసిందే. ఈ చిత్రాన్ని బెంచ్మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు 14వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి యువ హీరో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
నాలాంటి తను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్టమొదల ఎలా మొదలు పెడతాడు, ఇంట్రెస్టింగ్ కదా, అయితే అబ్బాయిలందరు మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఎవరికైన చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా మొదలు పెట్టారో నాకు చెప్పండి. చాలా మంది నేను మొదలు పెట్టినట్టే మొదలు పెట్టి ఉంటారు. నా 14వ సినిమా పూర్తి డీటైల్స్ తెలియాలంటే మార్చి 1 వరకు వెయిట్ చేయండని సుధీర్ బాబు వీడియో ద్వారా తెలియజేశాడు. ఇంట్రెస్టింగ్ ప్రేమ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.