సూరత్ థానీ: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్ది సహజ మరణమే అని తేలింది. ఈ విష యం వైద్యుల నివేదికలో బయటపడిందని థాయ్లాండ్ పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. వార్న్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత నివేదికను అతడి కుటుంబ సభ్యులకు, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి పంపినట్లు వారు పేర్కొన్నారు. స్పిన్ దిగ్గజం మరణంపై అతడి కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం లేదని వెల్లడించారు. మరోవైపు రిసార్టులో తుదిశ్వాస విడిచిన వార్న్ రూమ్లో రక్తం మరకలు కనిపించినట్లు తొలుత బయటపడిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటిదేమి లేదని తేలింది. వార్న్ పార్థీవదేహాన్ని సూరత్థాయి ప్రావిన్స్ నుంచి అంబులెన్స్లో బ్యాంకాక్కు తరలించారు.