కాన్బెర్రా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే శ్రీలంకపై సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మూడో పోరులో ఆతిథ్య ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్ డసున్ షనక (39) టాప్స్కోరర్ కాగా.. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. కెప్టెన్ ఫించ్ (35), స్టార్ ఆలౌరౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (39) రాణించారు. లంక బౌలర్లలో మహేశ్ తీక్షణ మూడు వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది. రిచర్డ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.