హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను మూడోసారి రూ.1.50 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 లేదా 150 శాతం డివిడెండ్ రూపంలో చెల్లించనున్నది. ఈ 2021-22లో డివిడెండ్ ప్రకటించడం ఇది మూడోసారి. మరోవైపు కంపెనీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.604.29 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. మునుపటి రూ.777.30 కోట్లతో పోలిస్తే 22.3 శాతం తగ్గింది. ఆదాయం రూ.6,064.80 కోట్ల నుంచి రూ.6,002.20 కోట్లకు పడిపోయింది.