శేరిలింగంపల్లి/సుల్తాన్బజార్, నవంబర్ 23 : నానక్రాంగూడలోని ఓ భవనంలో గ్యాస్ లీకై.. లైటు వేయగానే సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 11 మంది వలస కూలీలకు తీవ్ర గాయాలు కాగా, 5 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం తెల్లావారుజామున జరిగిన ఈ దుర్ఘటన వివరాలు పోలీసులు, బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. శేరిలింగంపల్లిలోని నానక్రాంగూడలో టోలిచోకికి చెందిన గౌస్పాషాకు 150 గజాలలో జీ+2 భవనం ఉంది. దీంట్లో ఉత్తర్ప్రదేశ్, బీహార్, రాజస్తాన్, అస్సాంకు చెందిన దాదాపు 44 మంది వలసకూలీలు అద్దెకు ఉంటున్నారు. వీరంతా వివిధ సంస్థల్లో ఎలక్ట్రీషియన్, కూలీ, మార్బల్స్, సెక్యూరిటీ గార్డ్స్, హౌస్ కీపింగ్ పనులు చేసేవారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెండంతస్తుల భవనానికి సంబంధించిన పైపులైన్ గ్యాస్ కనెక్షన్లు, మూడు సిలిండర్లు ఉన్నాయి.
మంగళవారం తెల్లావారుజామున 4.45నిముషాలకు గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ వలస కార్మికుడు లేచి లైట్ వేశాడు. అప్పటికే ఆ గదిలో గ్యాస్వాల్ సరిగా బంద్ చేయకపోవడంతో గ్యాస్ లీకై ఉంది. స్విచ్ వేయగానే ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో భవనం గోడలు కూలిపోయాయి. ఇతర అంతస్తుల్లో ఉన్న కార్మికులు, పరిసర ప్రాంతాల స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు, 12 మంది సభ్యులు కలిగిన 2 డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను నగరంలోని ఉస్మానియా, కొండాపూర్లోని ఏరియా హాస్పిటల్, సీయా లైఫ్ దవాఖానలకు చికిత్స నిమిత్తం తరలించారు. పేలుడు భవనంతో పాటు సమీపంలోని మరో మూడు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేశ్ ఇతర సిబ్బంది సహాయక చర్యలు పర్వవేక్షించారు.
క్షతగాత్రులు వీరే..
నానక్రాంగూడ ఫైనాన్షియ ల్ డిస్ట్రిక్లోని సోలాపురీయ స త్వా సంస్థలో ఎలక్ట్రికల్ పనులు నిర్వహించే షియా ఎలక్ట్రికల్ యజమాని, కాంట్రాక్టర్ ముం బయికి చెందిన కార్మికులు సులేమాన్ అజీజ్ ముజాఫర్(47), అతని వద్ద పనిచేసే ఉత్తరప్రదేశ్కు చెందిన కమలేశ్(24), బ బ్లూ యాదవ్ (24), బీహార్కు చెందిన నస్రే అలమ్, మీరజ్ ఖాన్(33), రాజేంద్ర కుమార్ సరోజ్(26),మహమ్మద్ రిజ్వా న్, పర్వేజ్ ఆలం(24), సునీల్, అప్జల్, వినయ్ పాటిల్కు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో మిరాజ్ఖాన్, రాజేంద్రకుమార్ల పరిస్థితి విషమంగా ఉంది.