గౌహతి: అస్సాం రాష్ట్రంలో జిహాదీ కార్యకలాపాలు పెరిగిపోయాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ అన్సరుల్ ఇస్లామ్తో రాష్ట్రానికి చెందిన అయిదు మాడ్యుల్స్కు లింకు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన అయిదు నెలల్లోనే ఆ మాడ్యుల్స్ను చేధించినట్లు తెలిపారు. అన్సరుల్ ఇస్లామ్కు చెందిన ఆరు మంది బంగ్లాదేశ్ జాతీయులు అస్సాంలోకి ఎంటర్ అయ్యారని, గత మార్చిలో బార్పేట వద్ద ఓ మాడ్యూల్ను గుట్టు రట్టు చేసినట్లు సీఎం శర్మ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇమామ్లు ఇక్కడ మదరస్సాల్లో బోధన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉగ్రవాదం, తీవ్రవాదానికి భిన్నంగా జిహాదీ ఉంటుందని, చాలా ఏళ్ల పాటు శిక్షణ ఉంటుందని, ఇస్లామిక్ భావజాలాన్ని ప్రమోట్ చేస్తారని, ఆ తర్వాత వ్యవస్థను నిర్వీర్యం చేస్తారని ఆయన ఆరోపించారు. 2016-17 కాలంలో అక్రమ రీతిలో బంగ్లాదేశీలు అస్సాంలోకి ఎంటర్ అయ్యారని, ఎవరైనా కొత్తగా మదర్సాలో ఇమామ్ లేదా టీచర్గా చేరితే వారి వివరాలను చెప్పాలని సీఎం బిశ్వ శర్మ తెలిపారు.