దుబాయ్: ఆసియా కప్లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్ ఫరీద్, బ్యాటర్ అసిఫ్ అలీ మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 19వ ఓవర్లో పాక్ బ్యాటర్ అసిఫ్ అలీ.. ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్పై బ్యాట్తో దాడి చేయబోయాడు. ఆ ఓవర్లో అయిదో బంతికి సిక్సర్ కొట్టిన అలీని.. ఆరవ బంతికి ఫరీద్ ఔట్ చేశాడు. అలీని ఔట్ చేసిన తర్వాత అతని మీదుకు వెళ్లాడు ఫరీద్. కానీ ఫరీద్ ప్రవర్తన నచ్చని అలీ.. తన బ్యాట్తో అతనిపై దాడి చేయబోయాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే వెంటనే ఆఫ్ఘన్ ప్లేయర్లు జోక్యం చేసుకుని ఇద్దరు ప్లేయర్లను వేరు చేశారు. ఈ ఘటన పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి చర్యలు తీసుకున్నది. ఇద్దరు ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆర్టికల్ 2.6ను అతిక్రమించినట్లు అసిఫ్పై ఆరోపణలు వచ్చాయి. ఇక ఆర్టికల్ 2.1.12 ప్రకారం రూల్స్ను ఫరీద్ ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది. తప్పు చేసినట్లు ఇద్దరు ప్లేయర్లు అంగీకరించారు.