హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా హ్యాండ్బాల్ పురుషుల క్లబ్ లీగ్ చాంపియన్షిప్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా జూన్ 21 నుంచి మొదలుకానున్న టోర్నీకి సంబంధించి ‘డ్రా’ను ఆదివారం భారత హ్యాండ్బాల్ సంఘం (హెచ్ఏఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు విడుదల చేశారు. టోర్నీలో మొత్తం 9 జట్లు బరిలోకి దిగనుండగా.. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-ఏలో భారత్, (టీ స్పోర్ట్స్ క్లబ్), సౌదీ అరేబియా (ఆల్ నూర్ క్లబ్), ఖతార్ (అల్ అరబీ క్లబ్), కువైట్ (అల్ ఖుదిసియా క్లబ్); గ్రూప్-బీలో కువైట్ (అల్ కువైట్ క్లబ్), సౌదీ అరేబియా (అల్ సఫా), ఇరాన్ (మిస్ కిర్మాన్ క్లబ్), బహ్రెయిన్ (అల్ నజ్మ క్లబ్), ఖతార్ (అల్ వక్రా క్లబ్) ఉన్నాయి. అంతకుముందు గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ప్లేయర్లకు కల్పిస్తున్న వసతి ఏర్పాట్లను ఆసియా హ్యాండ్బాల్ సమాఖ్య (ఏహెచ్ఎఫ్) కోశాధికారి బాదర్ అల్ తేయాబ్, ఈసీ సభ్యుడు అహ్మద్ అల్ షాబీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐవోఏ కోశాధికారి ఆనందీశ్వర్ పాండే, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రవి, నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.