వెంకట్, మయూఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఈశ్వర్ మ్యారేజ్ ఇందూతో’. ఈ చిత్రాన్ని కమల్ కళ్యాణ్ మూవీ మేకర్ పతాకంపై మూర్తి జంగిలి నిర్మిస్తున్నారు. కమల్ కళ్యాణ్ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వేణు ఊడుగుల క్లాప్నిచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కమల్ కళ్యాణ్ మాట్లాడుతూ…‘పక్కా తెలంగాణ యాసతో పల్లెటూరి ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎక్కడా ఆశ్లీలత ఉండదు. కొమురం భీమ్ జిల్లా దహేగాంలో 45 రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నాం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : కార్తీక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ : బ్రాడీ, ఎడిటర్ : జయంత్ ఎంజే, సాహిత్యం : మిట్టపల్లి సురేందర్.