కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను వారాహి చలనచిత్రం సంస్థ నిర్మిస్తున్నది. సాయి కొర్రపాటి నిర్మాత. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్త్తున్నారు.. శ్రీలీల నాయికగా నటిస్తుండగా..జెనీలియా, కన్నడ హీరో డాక్టర్ రవిచంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి కిరీటిని పరిచయం చేసే టీజర్ను విడుదల చేశారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ…‘హీరోగా ఎదిగేందుకు కావాల్సిన లక్షణాలు కిరీటిలో కనిపిస్తున్నాయి. బాగా నటించగలడు, డ్యాన్సులు, ఫైట్స్ చేయగలడు. కిరీటి వారాహి సంస్థలో పరిచయం కావడం సంతోషంగా ఉంది’ అన్నారు. ‘పునీత్ రాజ్కుమార్ నాకు స్ఫూర్తి. ఆయనతో సినిమా చేసిన దర్శకుడు రాధాకృష్ణ నా తొలి సినిమా తెరకెక్కించడం అదృష్టంగా భావిస్తున్నా. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. దేశంలోని అగ్ర సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పనిచేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు కథానాయకుడు కిరీటి. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్, స్టంట్స్ : పీటర్ హెయిన్, సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్.