ముంబై/న్యూఢిల్లీ, నవంబర్ 5: ఆర్యన్ఖాన్ క్రూజ్ డ్రగ్ కేసు దర్యాప్తు నుంచి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడేను తప్పిస్తున్నట్టు ఆ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వాయవ్య జోన్) ముతా అశోక్ జైన్ శుక్రవారం తెలిపారు. ఈ కేసుతో పాటు మరో ఐదు కేసుల దర్యాప్తు బాధ్యతను ముంబై యూనిట్ నుంచి ఢిల్లీ సెంట్రల్ యూనిట్కు బదిలీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసుల దర్యాప్తు వివిధ రాష్ర్టాలతో ముడిపడి ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే, వాంఖడేపై అవినీతి ఆరోపణలు రావడంతోనే బదిలీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.