ప్రయాగ్రాజ్: అలహాబాద్ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును ఇచ్చింది. పెళ్లి కోసం ఆర్య సమాజ్ ఇచ్చే సర్టిఫికేట్ చట్టపరంగా చెల్లదని హైకోర్టు తెలిపింది. పెళ్లిళ్లు కచ్చితంగా రిజిస్టర్ కావాలన్న నిర్ణయాన్ని కోర్టు వెల్లడించింది. హెబియస్ కార్పస్ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ సౌరబ్ శ్యామ్ శ్యామ్శేరి తీర్పునిస్తూ.. ఆర్య సమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికేట్లతో కోర్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయని, కానీ వివిధ కేసుల్లో ఆ సర్టిఫికేట్లను కోర్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాయన్నారు. పెళ్లిళ్ల నిర్వహణలో ఆర్య సమాజ్ వ్యవహారశైలి సరిగా లేదని, డాక్యుమెంట్లకు విలువ ఇవ్వడం లేదని కోర్టు పేర్కొన్నది. బోలా సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి నిరూపించుకునేందుకు ఆర్య సమాజ్ ఇచ్చిన సర్టిఫికేట్ను సమర్పించారు. కానీ వారి పెళ్లి రిజిస్టర్ కాలేదు. అయితే కేవలం సర్టిఫికేట్ ఆధారంగా పెళ్లిని ద్రువీకరించలేమని కోర్టు తెలిపింది.