ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్కు మళ్లీ నిరాశే మిగిలింది. ముంబై రంజీ ట్రోఫీ జట్టును ప్రకటించగా, ఆ జట్టులో అర్జున్కు చోటు దక్కలేదు. జూన్లో జరిగే నాకౌట్ రంజీ ట్రోఫీ మ్యాచ్లను ముంబై ఆడనున్నది. బెంగుళూరు వేదికగా ఉత్తరాఖండ్ టీమ్తో ముంబై జట్టు రంజీ మ్యాచ్లో తలపడనున్నది. పృథ్వీ షా ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై రంజీ జట్టు కోసం అర్జున్ టెండూల్కర్ పేరును ప్రకటించారు. కానీ ముంబై టీ20 మ్యాచుల్లో మాత్రం అర్జున్ ఆడాడు. అయితే ఇప్పటి వరకు అర్జున్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం జరుగుతన్న ఐపీఎల్ టోర్నీకి ముంబై జట్టు తరపున అర్జున్ టెండూల్కర్ను ఎంపిక చేసినా అతనికి మాత్రం ఒక్క మ్యాచ్లోనూ ఆడే వీలు రాలేదు. 30 లక్షలకు అర్జున్ను ఆ జట్టు వేలంలో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అర్జున్కు అవకాశం ఇవ్వకుండా ఐపీఎల్ టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముంబై రంజీ జట్టుకు ఎంపికైనవారిలో పృథ్వీ షా(కెప్టెన్), యశస్వి జైస్వాల్, భూపేన్ లాల్వానీ, అర్మన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్, ఆకర్షిత్ గోమల్, ఆదిత్య తారే, హార్ధిక్ తమోర్, అమన్ ఖాన్, సాయిరాజ్ పాటిల్, షామ్స్ ములానీ, దురిముల్ మట్కర్, తనుష్ కోటియాన్, శశాంక్ అతార్డే, ధావల్ కులకర్ణి, తుషార్ దేశ్పాండే, మోహిత్ అవాస్తీ, రొస్తాన్ డయాస్, సిద్ధార్థ రౌత్, ముషీర్ ఖాన్ ఉన్నారు.