ముంబై: ఈ యేటి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మరీ చెత్తగా ఆడుతోంది. ఆరు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క గేమ్లోనూ గెలవలేదు. అయితే ఆ జట్టులో కొన్ని మార్పులు చేయాలన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. భారీ ధర పెట్టి పెద్ద పెద్ద ఆటగాళ్లను కొన్నా.. ఆ జట్టుకు ఈ సారి కలిసి రావడంలేదు. ఇవాళ చెన్నైతో జరిగే మ్యాచ్లో కొన్ని మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. అయితే ముంబై జట్టుకు అర్జున్ టెండూల్కర్ ఆడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్.. ఓ ఆల్రౌండర్గా రూపుదిద్దుకుంటున్నాడు. ఎడమ చేతి స్పీడ్ బౌలర్ అయిన అర్జున్.. నెట్స్లో ఓ ప్లేయర్ను తన యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను ముంబై టీమ్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. నిజానికి లక్నోతో జరిగిన మ్యాచ్లో అర్జున్ అరంగేట్రం చేస్తాడని భావించారు. ఆ మ్యాచ్ను వీక్షించేందుకు సోదరి సారా టెండ్కూలర్ కూడా వచ్చింది. కానీ ఇవాళ్టి మ్యాచ్లో అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముంబై జట్టులో టెండూల్కర్ పేరున్నవాళ్లు ఉంటే ఆ జట్టుకు కలిసి వస్తుందేమో అన్న అభిప్రాయాల్ని ఇటీవల మాజీ క్రికెటర్ అజారుద్దీన్ వ్యక్తం చేశారు.
You ain't missing the 🎯 if your name is 𝔸ℝ𝕁𝕌ℕ! 😎#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/P5eTfp47mG
— Mumbai Indians (@mipaltan) April 20, 2022