అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఈ చర్చకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాలు విసురుతున్నట్లు వెల్లడించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి పానకంలో పుడకలు చర్చకు పంపించవద్దని సూచించారు.
ఆరోగ్యశ్రీ పేరును టీడీపీ హయాంలో చంద్రబాబు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆరోగ్యవర్సిటీ పేరు మార్చడంలో తప్పేమిలేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. దీంట్లో భాగంగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని వెల్లడించారు.