అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ (Vishwa Bhushan) హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తతం గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది.