అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2331 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల చిత్తూర్లో నలుగురు, కర్నూల్లో ఇద్దరు, అనంతపూర్, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 913274కు చేరింది. ప్రస్తుతం 13276 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 7262కు పెరిగింది.గడచిన 24 గంటల్లో 853 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.