తాడేపల్లి: రైతులకు సమాచారం అందించడమే లక్ష్యంగా ఆర్బీకే ఛానల్ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రైతులకు ఏవైనా సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చిన తెలిపారు.
రబీ ప్రొక్యూర్మెంట్ 2020–21తో పాటు, 2021–22 ఖరీప్ సన్నద్ధతపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.