అమరావతి : ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామరాజుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయన నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. గతంలో జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎంపీపై నమోదైన కేసుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించనున్నారు . దీంట్లో భాగంగా రెండురోజుల పాటు నరసాపురం నియోజకవర్గంలో పర్యటించేందుకు వస్తానని ముందుగానే ప్రకటించిన రఘురామరాజు ముందుగా హైదరాబాద్లోని తన నివాసానికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి నోటీసులతో చేరుకున్నారు.
రఘురామరాజు ప్రతిరోజు ఢిల్లీ వేదిక ద్వారా ప్రభుత్వ విధానాలను , ముఖ్యమంత్రి జగన్ వ్యవహార తీరును విమర్శిస్తు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించేందుకు వస్తే తనను పోలీసులు ఇబ్బందులు పెడుతారని ఐనా ప్రజల కోసం భరిస్తానని, అవసరమైతే ఎంపీ పదవికి పోటీచేసి మళ్లి గెలుస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.