సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆరిగామి పేపర్తో గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థి శివాలి శ్రీవాస్తవ అందమైన బొమ్మలు తయారు చేసి ప్రదర్శనకు పెట్టింది. ఇది అతిపెద్ద ప్రదర్శనగా నిలువగా గిన్నిస్బుక్లోకి ఎక్కే దిశగా అడుగులు పడుతున్నాయి. యూనివర్సిటీ సహకారంతో శివాలి మొత్తం 49,300 బొమ్మలు తయారు చేసింది. ఇందులో 20 వేల చేపలు, 2,000 నెమళ్లు, 1.600 కుక్కలు, 5,500 బూరెలు, 6,000 నిమ్మ తొనలు, 7,000 వేల్స్, 4,000 క్విల్లింగ్ దేవదూతలు, 3,200 క్విల్లింగ్ బొమ్మలను తయారు చేసి యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రదర్శించారు. గీతం యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ డి.మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలోని బృందం బొమ్మలను లెక్కించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనగా ప్రకటించారు. ఈ వివరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అధికారులకు పంపిస్తామన్నారు. అయితే శివాలి ఇప్పటికే 13 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో పాటు 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులను నెలకొల్పింది. యూనివర్సిటీ అదనపు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎన్. శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు శివాలిని అభినందించారు.