తెలుగు తెరపైకి మరో కొత్త నాయిక రాబోతున్నది. మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన మిర్నా మీనన్ టాలీవుడ్లో అడుగుపెడుతున్నది. యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త సినిమాలో ఒక నాయికగా దిగాంగన సూర్యవంశీని ఎంపిక చేయగా..ఇప్పుడు రెండో హీరోయిన్ గా మిర్నా చిత్రబృందంలో చేరింది. కుటుంబ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. కేకే రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రంతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దిగాంగన సూర్యవంశీతో పాటు మిర్నా మీనన్ నాయికగా ఉంటుందని, కథలో ఇద్దరి పాత్రలూ కీలకంగా ఉంటాయని చెబుతున్నారు దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంగీతం : ధృవన్, సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల, ఎడిటర్ : జి సత్య, యాక్షన్ : రామకృష్ణ.