కోటపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. శుక్రవారం కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ ఆధ్వర్యంలో గిరిజన రైతులు, నాయకులు మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సురేఖ మాట్లాడుతూ… రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని అన్నారు.
పోడు భూముల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పోడుభూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందచేయాలని 2020 సంవత్సరంలోనే కోటపల్లి మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జేక శేఖర్, చంద్రగిరి శంకర్, గిరిజన నాయకులు కొమిరెళ్లి విజయ్, సప్ప మధుకర్ తదితరులు పాల్గొన్నారు.